గోల్డ్ న్యూస్- ములుగు జిల్లా ప్రతినిధి:
మావోయిస్టుల దుశ్చర్య ను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇన్ ఫార్మర్ల నెపంతో శుక్రవారం రాత్రి ఇద్దరిని మావోయిస్టులు దారుణం గా నరికి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే.ఈ దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చిన దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్ అంటూ నినదించారు. మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసీలను చంపటమేనా అని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.. చేశారు..
Post Views: 29