మందుపాతర పేలి. జవాన్‌కు గాయాలు.

 

చత్తీస్గడ్ : మావోయిస్టులు పాతిపెట్టిన మందు పాత్ర పేలి ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్‌గూడెం, తుమల్‌పాడ్‌ గ్రామాల మధ్య నక్సలైట్‌లు ప్రెషర్‌ కుక్కర్‌లో పేలుడు పదార్థాలు నింపి పాతిపెట్టారు. గాయపడిన జవాన్‌ను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలించాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Facebook
WhatsApp
Twitter
Telegram