నూతన మండలం గా మల్లంపల్లి

ములుగు జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ అయ్యింది. ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క మండలం ఏర్పాటు చేస్తామంటూ స్థానిక ప్రజల హామీ ఇచ్చారు. మల్లంపల్లి, రామచంద్రాపూర్ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటు చేశారు. ములుగు రెవెన్యూ డివిజన్, జిల్లా పరిధిలోనే ఈ గ్రామం కొనసాగనుంది. ఏడ్లుగా స్థానికులు చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటూ సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram