కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి.

గోల్డెన్ న్యూస్ కోటగిరి:  పోతంగల్ మండల కేంద్రంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ప్రజలు బుధవారం ధర్నా కు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థుడు బజరంగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త కార్డులను మంజురు చేయాలని కోరారు. అలాగే మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిరణ్ సెట్, సూదం అశోక్, తుకారం, శంకర్, సయ్యద్, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు…

 

Facebook
WhatsApp
Twitter
Telegram