గోల్డెన్ న్యూస్/తెలంగాణ: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ ..
పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్రపతితో సమావేశం గిరిజన ఆదివాసి ప్రజల అభివృద్ధిపై రాష్ట్రపతి తో 15 నిమిషాల పాటు చర్చ రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి, వారి సంక్షేమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి నివేదించిన ఎమ్మెల్యేలు.తెలంగాణలోని ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్రపతిని కోరిన ఎమ్మెల్యేలు. గిరిజనుల గార్డియన్ గా వారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు అయ్యేలా చూడాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేలు..
ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి
ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఎస్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి కేంద్రానికి నివేదిక అందజేయాలని మంత్రి సీతక్కను ఆదేశించిన రాష్ట్రపతి…