భద్రాచలం లో 5.25 కేజీల బాబు జననం- ఇది ఒక అరుదైన ఘటనగా పేర్కొన్న ఏరియా హాస్పిటల్ వైద్యులు.
గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 19న రాత్రి ఓ మహిళకు 5.25 కేజీల బరువున్న మగశిశువు జన్మించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన మడకం నందిని కాన్పు కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేశారు. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. ఇందులో విశేషమేమిటంటే. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి సుమారు మూడున్నర కిలోల బరువు ఉంటారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ తెలిపారు. కానీ నందిని కి జన్మించిన బిడ్డ 5.25 కిలోలు ఉందని, ఇది ఒక అరుదైన ఘటన అని పేర్కొన్నారు.నందినికి ఇది మూడో కాన్పు ముగ్గురు మగ సంతానమే.