శ్రీ రాజరాజేశ్వర ఆలయ కమిటీ ఎన్నిక

గోల్డెన్ న్యూస్/ పినపాక : మండల పరిధిలోని సీతంపేట గ్రామానికి చెందిన శ్రీ రాజ రాజేశ్వరా దేవస్థాన ఆలయ నూతన కమిటీ బుధవారం ఏకగ్రీవంగా ఎందుకున్నారు.   దేవస్థాన పెద్దలు తొలుత సమావేశమై  పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది , అనంతరం శివరాత్రి మహోత్సవం గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా 16 మంది సభ్యులతో కూడిన ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారు నరేంద్ర, కొండేరు .వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా అరే శంకరయ్య , ప్రధాన కార్యదర్శి గా బండారు రామ చందర్ రావు, కోశాధికారిగా అరే లెనిన్ ప్రసాద్, కొండేరు కృష్ణ మూర్తి ఉండగా ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు బండారు నరేంద్ర, కొండేరు వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ … రాబోయే శివరాత్రి మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా , ప్రజలకు ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు ఆలయ అభివృద్ధి కొరకు తమ శక్తి మేరకు కృషి చేస్తాం అని  అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రాజ రాజేశ్వరా ఆలయ నూతన కమిటీ సభ్యులు అరే శంకరయ్య, బండారు రామ చందర్ రావు, లెనిన్ ప్రసాద్, కృష్ణ మూర్తి,గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram