నిర్మల్‌ కోర్టు సంచలన తీర్పు.. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశం

నిర్మల్‌ కలెక్టర్‌, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ సంచలన తీర్పు వెల్లడించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో కలెక్టర్‌, ఆర్డీవో జాప్యం చేసిన నేపథ్యంలో నిర్మల్‌ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.1999లో గడ్డెన్న, శ్రీరాంసాగర్‌ జలాశయంలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. కలెక్టర్‌ రూ.6.79 కోట్లు, ఆర్డీవో కార్యాలయం 1.45కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. కానీ నష్టపరిహారం చెల్లించడంలో కలెక్టర్‌, ఆర్డీవో జాప్యం చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram