గోల్డెన్ న్యూస్ / పినపాక : ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటి రత్తాలు (55) వడదెబ్బ సోకి శుక్రవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదివారం తనచెల్లి కూతురు పెళ్ళి సందర్భంగా 3 రోజుల పాటు వివాహా ఆహ్వాన పత్రికలు పంచేందుకు బంధువుల ఇండ్లకు తిరగడంతో అస్వసత గురై వాంతులు, విరేచనాలు అవుతూ స్పృహ తప్పి పడిపోగ శుక్రవారం మణుగూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి చేర్పించారు. వైద్యం పొందుతూనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Post Views: 42