గోల్డెన్ న్యూస్ / కరీంనగర్: పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించారు. ఆయన రాక సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అయితే ఈ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ పద్మజను ఓ యువకుడు ప్రమాదవశాత్తు బుల్లెట్ బైక్ తో ఢీకొట్టాడు. ఈ ఈ ప్రమాదంలో ఆమె కాలు విరగడంతో ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. చికిత్సకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట భారాస నేతలు వినోద్, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Post Views: 16