గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో పేదల కల అయిన సొంతింటి ఆశయాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. పథకం తొలి దశలో అత్యంత పేదలైన, నిజమైన అర్హులకే ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే ఇంది రమ్మ ఇళ్ల చెక్కుల పంపిణీ షూరు చేశారు. మంగళవారం శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. అందులో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసులు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లులో మొట్టమొదటి బిల్లును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి, మరికొందరు లక్ష రూపాయల చెక్కును అందుకున్నారు.
కాగా, శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.