పాఠశాలలను తనిఖీ చేసిన డీఈఓ.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర చారి , ఏ ఎం ఓ నాగరాజుశేఖర్ గురువారం జిల్లా పరిషత్ కరకగూడెం,   జిల్లా పరిషత్ బట్టుపల్లి పాఠశాలలు మరియు మండల విద్యా వనరుల కేంద్రం ను సందర్శించారు . ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న నవోదయ పాఠశాల తాత్కాలిక మరమ్మతుల పనులు మరియు పాఠశాలల పలు రికార్డ్స్, సమ్మేటివ్ పరీక్షలు పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మండల విద్యాశాఖ అధికారిని జి మంజుల  మరియు బట్టుపల్లి ప్రధానోపాధ్యాయులు టి మోహన్ బాబు  పాఠశాల సిబ్బంది మరియు సి ఆర్ పి లు  పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram