గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు మోటారు సైకిల్పై తిరుగుతూ గురువారం పరిశీలిం చారు. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు దండకారణ్యంలో పర్యటించిన ఆయన చర్ల మండలం పూసుగుప్ప నుంచి ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దు రాంపురం గ్రామాల మధ్య రూ.2.9 కోట్ల వ్యయంతో చేపట్టిన 1.9 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీ లించారు. సరిహద్దు గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్డు వల్ల ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాంపురం, భీమవరంపాడు గ్రామాల ఆదివాసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ అన్నారు. ఆదివాసీ గిరిజను లకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు పోలీసు శాఖ ద్వారా చేపట్టిన పనులను ఆయన మీడియాకు వివరించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, సీఐ రాజువర్మ ఉన్నారు.
Post Views: 26