రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తి మృతి

గోల్డెన్ న్యూస్ / కరీంనగర్ :  వీణవంక మండలం చల్లూరు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా  ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram