రెండు నిమిషాలు మౌనం పాటించిన సీఎం, మంత్రులు.
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : జమ్ము కశ్మీర్ పహల్గామ్లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పలువురు మంత్రివర్గ సహచరులతో నిర్వహించిన సమావేశం ఉగ్రవాదుల దాడులను ఖండించింది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర ప్రతినిధులతో జరిగిన సమావేశం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Post Views: 19