తెలంగాణ కొత్త సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు .ఈ నెలలో పదవి విరమణ చేయనున్న సీఎస్ శాంతకుమారి.. ఈ క్రమంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనున్నది.

Facebook
WhatsApp
Twitter
Telegram