వీడియో కాల్ ద్వారా వైద్యం .. కవలలు మృతి

అందుబాటులో లేని డాక్టర్.. వీడియో కాల్ ద్వారా  వైద్యం చేసిన నర్స్..న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా..ఆసుపత్రిని సీజ్ చేసిన డీఎంహెచ్ వో

గోల్డెన్ న్యూస్ /ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో గర్భవతికి సిజేరియన్ నిర్వహించగా.. కవల శిశువులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించారని వాళ్లు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

వివరాలకు వెళితే ..20 రోజుల కింద ట్రీట్మెంట్ కోసం కీర్తి హాస్పిటల్కు వచ్చింది. స్కానింగ్ చేసిన డాక్టర్.. కడుపులో కవలలు ఉన్నారని, ఎలాంటి పనులూ చేయొద్దని సలహా ఇచ్చింది. కడుపు దగ్గర కొన్ని కుట్లు వేసి పంపించేసింది. 5 నెలల గర్భిణి అయిన కీర్తికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డాక్టర్ అనూషా రెడ్డికి ఫోన్ చేశారు. ఓ ఇంజక్షన్ పేరు చెప్పి వెంటనే వేయించాలని సూచించింది. అయినప్పటికీ నొప్పులు తగ్గకపోవడంతో కీర్తిని కుటుంబ సభ్యులు విజయలక్ష్మి హాస్పిటల్కు తీసుకెళ్లారు. నొప్పులు తగ్గేందుకు ఇంజక్షన్ చేయాలని నర్సులకు డాక్టర్ సూచించింది.

 

ఇంజక్షన్ చేసినా నొప్పులు తగ్గలేదు. నర్సులతో ఆమె వాట్సప్ వీడియో కాల్ లో మాట్లాడుతూ వైద్యం అందించింది. ఉదయం 10.30 గంటలైనా డాక్టర్ హాస్పిటల్కు రాలేదు. వీడియో కాల్లో మాట్లాడుతూ.. నర్సులతోనే ట్రీట్మెంట్ చేయించింది. చివరికి ఇద్దరు మృత శిశువులు బయటికి వచ్చారు. 11 గంటలకు హాస్పిటల్కు వచ్చిన డాక్టర్ అనూషా రెడ్డి.. కవలలు చనిపోయారని, తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. ఆ కవలలను ఆదివారమే కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. సోమవారం ఉదయం కీర్తిని డిశ్చార్జి చేసే టైమ్లో రూ.30వేలు కట్టాలని డాక్టర్ అనూషా రెడ్డి చెప్పింది.

దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్ తో  పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీ ఎఫ్ కు సుమారు రూ.5 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే కవలలు చనిపోయారని ఫైర్ అయ్యారు. కవలలు చనిపోయేందుకు డాక్టర్ అనూషా రెడ్డినే కారణమంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగార తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram