గోల్డెన్ న్యూస్ /భూపాలపల్లి : కాటారం మండలంలో మంగళవారం ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. దేవరాపల్లికి గ్రామానికి చెందిన వృద్ధురాలు మారుపాక లక్ష్మిపై ఓ యువకుడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.
పాత హత్యకేసు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది మారుపాక లక్ష్మి గతంలో అదే గ్రామానికి చెందిన మారుపాక సారయ్య హత్యకేసులో నిందితురాలిగా అరెస్టయిన అరెస్టు అయింది.ఇటీవలే ఆమె బెయిల్పై విడుదలై పోలీస్ స్టేషన్కు వచ్చి తిరిగి ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో, మారుపాక సారయ్య కుమారుడు మారుపాక అంజి ఆమెపై దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో లక్ష్మి గాయాల పాలైంది. ఆమెను భూపాలపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
భూవివాదమే నేపథ్యమా?
లక్ష్మి కుటుంబం మరియు సారయ్య కుటుంబం మధ్య గత కొన్ని సంవత్సరాలుగా భూవివాదం నడుస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత కక్షల కారణంగా అంజి ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు యేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.