భద్రాద్రి రామయ్య క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త రామయ్య చెంతకు 8 లైన్ హైవే రోడ్స్.
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం ఏర్పాట్లు చేపట్టనున్నారు. భద్రాద్రి రామయ్య క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఖమ్మంతల్లాడ నుండి భద్రాచలం వరకు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మించనుండగా.. అందుకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి అని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుకు.. ప్రభుత్వం రూ.2,606 కోట్లు కేటాయించగా.. భూసేకరణ, రోడ్స్ కి ఇరువైపులా వున్నా గృహ సముదాయలు, భవనములు, షాప్స్ ని హైవే నియమాలు ప్రకారం తొలిగింపు కి సంబందించిన సర్వే రిపోర్ట్స్ ని త్వరగా ప్రభుత్వం కి అందచేయాలి అని అధికారులు కు ఆదేశాలు ఇవ్వనైనది. రెండు సంవత్సరాలలో రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని గుత్తేదారులు తెలిపారు. ఈ రహదారి ఖమ్మం జిల్లా తల్లాడ నుండి భద్రాద్రి జిల్లా భద్రాచలం మీదుగా, ములుగు, భూపాలపల్లి, జిల్లాలను కలుపుకొని వెళ్తుంది.