అనిశా వలలో పంచాయితీ కార్యదర్శి

గోల్డ్ న్యూస్ /నిజామాబాద్ : మక్లూర్ మండలం గొట్టుముక్కుల గ్రామంలో అక్రమ కార్యకలాపం వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఇంటికి ఇంటి నంబరు కేటాయించడంలో, అలాగే బహిరంగ స్థలానికి అసెస్‌మెంట్ నంబర్లను మంజూరు చేయడంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారిక అనుమతిని చూపించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగ మోహన్ రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు.

ఇంటి యజమాని అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ.18,000 నేను తగ్గించి తీసుకుంటూ ఉండగా, అతను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని అవినీతి నిరోధన చర్యల్లో మరొక కీలకమైన దశగా నిలిచింది.

Facebook
WhatsApp
Twitter
Telegram