క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించిన మంత్రి సీతక్క.
గోల్డెన్ న్యూస్ / రేగొండ : భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదివారం వెళ్తున్న సమయంలో రేగొండ మండలం చెన్నాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయాలు అయినా క్షత్రగాత్రులను చూసి ఆగి వారిని ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. మరికొంత ముందుకు సాగగా అదే గ్రామం చివర మరొక యాక్సిడెంట్ అయ్యింది స్పందించిన మంత్రి అంబులెన్స్ పిలిపించి వారిని కూడా ఎక్కించి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. ఆమె వెంట ములుగు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు..
Post Views: 33