మైనార్టీ స్కూళ్లకు తాళం.. రోడ్డు మీద టీచర్లు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బాగ్ లింగంపల్లి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ రీ ఓపెన్ చేద్దామని ప్రిన్సిపల్ వెళితే ఆ భవనం ఓనర్ అడ్డుతగిలారు.13 నెలలుగా బిల్లు రాలేదని   బిల్డింగ్ యజమాని అంటున్నారు. పాఠశాల భవనాలకు యజమాని తాళం వేయడంతో రోడ్డుపై వేచి చూస్తున్న విద్యార్థులు, టీచర్లు.

వేసవి సెలవుల అనంతరం జూన్ 12 గురువారం స్కూల్ పునఃప్రారంభం అవుతుండగా, పాఠశాలకు తాళాలు చూసి షాకైన టీచర్లు. ఎంత రిక్వెస్ట్ చేసిన వినలేదు. అధికారులు చొరవ తీసుకోవాలి. టీచర్లను రోడ్డు మీద నిలబెడితే పాఠాలు ఎలా చెప్పాలి.’అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోని మైనార్టీ గురుకుల స్కూళ్లకు తాళాలు వేసిన భవనం యజమానులు

Facebook
WhatsApp
Twitter
Telegram