గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ పంపి బెదిరించిన ఆగంతకులు అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు.
ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బైటకు తరలింపు
రంగంలోకి దిగిన స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్
ఎయిర్పోర్ట్ను అణువణువు గాలిస్తున్న జాగిలాలు, బాంబ్ ఎక్స్ ప్లోజివ్ ఎక్స్ పర్ట్స్
అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్పోర్ట్ అథారిటీ హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి
బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగుడి ఈమెయిల్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అనంతరం అధికారులు విమానాశ్రయంలో బాంబు లేదని తేల్చారు.
దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం అధికారులు
మెయిల్ పంపిన పంపిన వ్యక్తి ఎవరు.? కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం