గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు
ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో, వారెంట్ జారీ చేసిన కోర్టు
తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని ఆదేశించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.
Post Views: 22