విద్యుత్ తీగ తగిలి మహిళ మృతి

గోల్డెన్ న్యూస్ /ఖమ్మం :ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కస్నాతండాకు చెందిన ముత్తమ్మ ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా పైన ఉన్న 11KV విద్యుత్ తీగ తగిలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. ముత్తమ్మ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram