విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ పట్టణంలోని  జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల,నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ,హైదరాబాద్‌కు చెందిన రోహిణి ఫౌండేషన్ సహకారంతో  విద్యార్థుల కు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  డీఎంహెచ్ఒ డాక్టర్ జయలక్ష్మి హాజరై వారు మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఇటువంటి శిబిరాలు చాలా అవసరం. నవ లిమిటెడ్ ఈ బాధ్యతను తీసుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నవ లిమిటెడ్ సిఎస్ఆర్ జనరల్ మేనేజర్ ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్స్ – పాల్వంచ, యానంబైలు, పూనుకుల, మండల పరిషత్ ఉన్నత పాఠశాలలు – వికలాంగుల కాలనీ, ఆర్సీ బంజర, శ్రీనివాస నగర్ లాంటి పాఠశాలల్లో మొత్తం 1100 మందికి పైగా విద్యార్థులకు దంత పరీక్షలు మరియు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రోహిణి ఫౌండేషన్ డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ..రూరల్ కేర్ , ఐరన్ హెల్తీ చైల్డ్” కార్యక్రమం కింద విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో ఈ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ జీఎం బి. రామారావు, పాఠశాల హెచ్‌ఎం రమ, మొబైల్ సైన్స్ యూనిట్ సిబ్బంది రాజేశ్వరరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram