♦వాగులు, చెరువుల వద్ద ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.
♦అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందండి
♦ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు :
గోల్డెన్ న్యూస్ / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున పాత ఇళ్లలో ఎవరూ నివాసం ఉండవద్దని, శిథిలావస్థకు చేరిన మట్టిమిద్దెలు కూలే ప్రమాదం ఉన్నందున అలాంటి ఇళ్లలోని వారు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలలో నివాసం ఉండాలని కోరారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. నదులు, వాగులు, వద్దకు జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. పశువులను పశువుల కాపర్లు పశువులను నదులు,వాగుల పరిసర ప్రాంతాల వెళ్లకూడదని సూచించారు. సాధ్యమైనంత వరకు అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాలలో బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు .జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు,వాగులు,నదుల వద్ద అప్రమత్తం చేశామన్నారు.