గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం :నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా మణుగూరు మండలంలోని పలు గ్రామాలు , కాలనీల్లో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చింది . ఈ పరిస్థితిని పరిశీలించేందుకు భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి దామోదర్ బుధవారం మణుగూరు వచ్చి. స్థానిక రెవెన్యూ, మున్సిపాలిటీ, మండల అధికారులతో కలిసి వరద ముంపు మణుగూరు సుందరయ్య నగర్, ఆదర్శనగర్, వరద ఉధృతిని ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక నివాసితులకు అప్రమత్తంగాఉ ఉండాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
Post Views: 335