చండ్రుగొండ కలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : చండ్రుగొండ మండలం కలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని శుక్రవారం క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో క్లబ్ అధ్యక్షుడిగా గుగులోత్ బలరాం నాయక్, మండల ప్రధాన కార్యదర్శిగా ఎస్.కే జాఫర్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా సోమనపల్లి వెంకటేశ్వర్లు, సయ్యద్ నూరే రబ్బాని, మహ్మద్ పాషా, డి లక్ష్మణ్, రాచకొండ నాగేశ్వరరావు, కొదుమూరి సత్యనారాయణ, తాళ్ళూరి రాందాస్, కంచర్ల కృష్ణ ప్రసాద్, బరగడి వీరభద్రమ్, తేజవత్ వెంకటేశ్వర్లు, శ్రీరాం రమేష్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు,

Facebook
WhatsApp
Twitter
Telegram