మత్స్యకారులు చిక్కిన 500 కిలోల సొర చేప
గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ : అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం మత్స్యకారుల గాలానికి శనివారం భారీ సొర చేప చిక్కింది.
దాన్ని చూసి తొలుత భయపడిన మత్స్యకారులు 5 గంటలపాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు.
ముందుగా సొరను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు. పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి..
లాక్కొచ్చారు. ఈ 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొరను వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారుడు మడ్డు నూకరాజు వివరించారు.
Post Views: 44









