పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు!

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. న్యాయసలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.  బీఆర్ఎస్ పార్టీ కి చెందిన  పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. అయితే అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ పూర్తిస్థాయిలో చర్చలు జరిపాకే సమాచారం.  ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ సంజయ్కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్తోగౌడ్, కృష్ణమోహన్రెడ్డి, మహిపాల్రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ లో చేరలేదని ప్రకటించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram