షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి

♦ రైతుల పక్షాన నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

♦ వ్యవసాయ ఆధికారికి వినతి పత్రం అందజేత

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరకగూడెం మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారి పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ….తప్పుడు హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని ధీనస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం  ఉందన్నారు. అనంతరం సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగా కాళిక,సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య,భూర్గంపాడు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మాజీ సర్పంచులు ఊకే రామానాథం,పాయం నర్సంహారావు,కొమరం విశ్వనాథం,పోలెబోయిన నరసింహారావు,బీఆర్ఎస్ నాయకులు చిరంజీవి,నాగేష్,సత్యనారయణ,పోలేబోయిన క్రిష్ణరావు,సోషల్ మీడియా అధ్యక్షులు సిద్ది సునిల్,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram