గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. టైమ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని వివరించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఖాళీ వివరాలు గెజిట్ నోటిఫికేషన్ నిన్న(ఆదివారం) తమకు అందిందని వెల్లడించారు. ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారిగా పబ్లిష్ చేశామని తెలిపారు. 









