గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : హైదరాబాద్ నగర పర్యటనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. నగరంలో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా ఆయన ఇవాళ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్ రాంచందర్ రావు, పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ ఈటల రాజేందర్, నేతలు, అధికారులు ఎయిర్పోర్టులో ఆయనకు స్వాగతం పలికారు. రాజ్నాథ్ సింగ్ హైటెక్స్లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
Post Views: 21









