గోల్డెన్ న్యూస్/ ఖమ్మం : ఇటీవల అత్యంత కిరాతక జరిగిన హత్య కేసును పోలీసులు వివాహాత్మకంగా ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు, సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దర్యాప్తులో వెలుగు చూసిన సంచలన విషయాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన గట్టా వెంకటేశ్వర్లు(38) హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 14న గ్రామంలో జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొని సెప్టెంబర్ 15న హైదరాబాద్కు తిరిగి వెళుతున్నానని తన బావకు చెప్పి బయలుదేరారు. ఆ తర్వాత మూడు రోజుల వరకు వెంకటేశ్వర్లు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన బావ యాదగిరి సెప్టెంబర్ 22న కామేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో వెంకటేశ్వర్లు బ్యాంకు ఖాతా నుంచి డిజిటల్ లావాదేవీలు జరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఆధారాల ద్వారా అశోక్ అనే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన వెంకటేశ్వర్లుకు, ప్రధాన నిందితుడు అశోక్కు ఖమ్మంలోని లైబ్రరీలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు తరచూ కలుసుకునేవారు. సెప్టెంబర్ 16న వెంకటేశ్వర్లును తన రూమ్కు పిలిపించిన అశోక్.. అతను నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా కత్తితో ముక్కలుగా నరికి హత్య చేశాడు. ఆ తర్వాత శరీరం భాగాలను బైక్పై తీసుకొచ్చి ఖమ్మం శివారు ప్రాంతాల్లో పడేశాడు. ఈ హత్య కేసులో అశోక్కు సహకరించిన నగ్మా, కృష్ణయ్య అనే మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, ఫోన్లు, అలాగే వెంకటేశ్వర్లుకు చెందిన గోల్డ్ చైన్, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరాతక హత్య స్థానికంగా భయాందోళనలకకు గురిచేస్తుంది.









