నిన్నటి వరకు వారు మనుషులు
జీవితం పైన ఆశలతో నిండినవారు,
ఇంటివాళ్లకు “వచ్చేస్తా” అని చెప్పి,
మరల కనిపించని దారిలో మాయమయ్యారు.
ఆ బస్సు చక్రాలు గమ్యాన్ని చేరలేకపోయాయి,
ఒక మోటార్ శబ్దం ఆపేసింది ప్రాణాల పయనాన్ని.
కలలతో బయల్దేరిన ఆ పాదాలు —
బూడిదగా మారి నిలిచిపోయాయి.
మంటల్లో కరిగిపోయింది మానవత్వం,
ధగధగలలో దాచుకుంది బాధ.
అరుపులు ఆగిపోయిన తర్వాత —
కన్నీళ్లు మాత్రమే మిగిలాయి ఆ మార్గంలో.
తల్లి ఎదురుచూస్తుంది కిటికీ తలుపు వైపు,
బిడ్డ పరిగెడ్తుంది తండ్రి పేరు పిలుస్తూ,
కానీ తిరిగిరారు వారు…
తిరిగి వస్తుందో ఆ జ్ఞాపకం మాత్రమే.
వారి ఆత్మలు వెలుగులా నిలవాలి.
ఆత్మలకు శాంతి కలగాలి…
Post Views: 15









