గోల్డెన్ న్యూస్ /హుజురాబాద్ : పట్టణంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సీనియర్ పాత్రికేయుడు గడ్డం హర్షవర్ధన్ గాయపడ్డారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే. సీనియర్ పాత్రికేయులు హర్షవర్ధన్ తన ద్విచక్ర వాహనాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిలిపి మిత్రులతో మాట్లాడుతుండగా, అన్నపూర్ణ థియేటర్ వైపు నుంచి యమహా బైక్పై వచ్చిన ఓ యువకుడు అతి వేగంగా దూసుకొచ్చి ఆయన వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ ద్విచక్ర వాహనానికి సైలెన్సర్ తొలగించడంతో ఘోర శబ్ద కాలుష్యం నెలకొంది. వాహనాన్ని అజాగ్రత్తగా నడపడంతో నిలిచి ఉన్న హర్షవర్ధన్ను ఢీ కొట్టిన యువకుడు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో హర్షవర్ధన్ కాలికి గాయమైంది. ఆయన ద్విచక్ర వాహనం దెబ్బతినగా, అతని వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లు పూర్తిగా పగిలిపోయాయి.సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన యువకుడిని,వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.గాయపడిన వ్యక్తిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.








