ఎమ్మెల్యే లపై ఫిర్యాదులు…సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: ఉచిత ఇసుక అంశంలో ఫిర్యాదులు రావడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు.దీనిపై చర్చించేందుకే ఎల్లుండి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని క్యాబినెట్ భేటీలో తెలిపారు.ఇసుక అంశంలో MLAల జోక్యంపై వచ్చిన ఫిర్యాదుల పై చర్చిస్తామన్నారు.లబ్ధిదారుల పై రవాణా ఛార్జీలు తప్ప ఇతర ఛార్జీలు పడకూడదని, ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయొద్దన్నారు.అక్రమాలు జరగకుండా ఇన్ఛార్జ్ మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram