రాష్ట్రంలో మరో వారం రోజులు వానలు

ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి..

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్‌  : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొన్నది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీజేసినట్టు తెలిపింది.

 

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు వెల్లడించింది. రాష్ట్రంలో మూడ్రోజులు పలు జిల్లాలో వడగండ్ల వాన కురిసే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram