పోలీసుల హామీ మేరకు నిరసన విరమించారు.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం కల్వర్టు రోడ్డుపై ఓవర్ లోడుతో ఇసుక లారీలు త్వరగా వద్దని గ్రామస్తులు తలన చేశారు. ఇసుక రాంప్ నుండి రోజుకు సుమారు100 నుంచి 200 లారీలు తిరుగుతున్నాయి. వాటి ప్రభావం అక్కడ ఉన్న రోడ్డు, చిత్తడి చిత్తడి మారిపోయి బాగా దెబ్బతిన్నదని. ఇసుక లారీలు తిరగడం వల్ల కనీసం ఆంబులెన్స్ రావడానికి కూడా మార్గం సరిగ్గా లేదని తూరుబాక కలవర్టు వద్ద శుక్రవారం గ్రామస్తులు నిరసన చేశారు పోలీసుల హామీతో నిరసన విరమించిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో రావులపల్లి పృద్వి, నిమ్మగడ్డ శ్రీనివాస్, చంచల కృష్ణ, తణుకు సాగర్, సాగర్, వాగే వెంకటేశ్వరరావు, తూరుబాక సర్పంచ్ భూక్య చందు, బానోతు నగేష్, జక్కుల శరత్ ,మోతుకూరి సాయిబాబు, మోతుకూరి వినోద్, గుమ్మడి అనిల్ మరియు తూరుబాక యూత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 70