పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లారు. తర్వాత ఏం జరిగిందంటే

ఓరి మీ వేషాలు తగలెయ్య…..పేకాట కోసం ఎక్కడా స్థలం లేనట్టు నది మధ్య లోకి వెళ్లారు….ఇంకేముంది ఒక్కసారిగా వరద రావడం తో …పేకాట గీకట జంతా నై… మా ప్రాణాలు కాపాడిండి మహా ప్రభో అని వేడుకున్నారు…చివరికి!

గోల్డెన్ న్యూస్ / నెల్లూరు : నల్లూరులోని భగత్ సింగ్ కాలనీ వద్ద ఉన్న పెన్నా నదిలో పది మంది యువకులు చిక్కుకుపోయారు.

 

పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లారు.

 

సోమశిల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో ఒక్కసారిగా నదిలో నీరు చుట్టుముట్టింది.

 

దీంతో ఆ పది మంది అక్కడే చిక్కుకుపోయారు.

 

స్థానికులు సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా వారిని బయటికి తీసుకొచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram