అక్టోబర్ 1 నుంచి స్పీడ్ పోస్టులో కొత్త ఫీచర్లు

 

స్పీడ్ పోస్ట్లో టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను పోస్టల్ శాఖ ప్రకటించింది. 

 

అత్యంత విశ్వసనీయ డెలివరీ సేవగా మరింత బలోపేతం చేయడానికి, భద్రతను, విశ్వసనీయతను పెంచే లక్ష్యంతో కొత్త ఫీచర్లతో ఈ సేవలను నవీకరించారు. 

 

సవరించిన టారిఫ్ అక్టోబర్ 1నుంచి అమలులోకి వస్తుంది. ఇకపై ఒక్కో స్పీడ్ పోస్టుపై రూ. 5 లతోపాటు జీఎస్టీ రుసుముగా వసూలు చేస్తారు. 

 

వన్ టైమ్ పాస్ వర్డ్ డెలివరీ విలువ ఆధారిత సేవలకూ ఇదే రుసుము వర్తిస్తుంది. 

 

అలాగే విద్యార్థులకు స్పీడ్ పోస్టు సేవలు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టారిఫ్ పై 10శాతాన్ని తగ్గించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram