మణుగూరులో స్పెషల్ బలగాలు.. 144 సెక్షన్ అమలు

గోల్డెన్  న్యూస్ / మణుగూరు : మణుగూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి దగ్ధం చేసిన సంఘటనా స్థలం వద్దకు ఆదివారం స్పెషల్ పార్టీ బలగాలు చేరుకున్నాయి. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పర్యవేక్షణలో 144 సెక్షన్ అమలు చేశారు . ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా, ముగ్గురికి మించి గుంపుగా కూడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు..

Facebook
WhatsApp
Twitter
Telegram