ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే కుట్ర 

గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు  : ఆదివాసులను అడవికి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న నిర్వహించుకోవడం జరుగుతుంది

 

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం

49 /1994 చేసి వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 దేశాల్లో ఆదివాసి తెగలు ఉంటే కేవలం 90 దేశాల్లో మాత్రమే ఆదివాసీలు పౌరులుగా గుర్తించి పడుతున్నారు,

78 ఏళ్ల భారత వనిలో హక్కుల కోసం కొనసాగుతున్న ఆదివాసి పోరాటాలు ఉద్యమాలు ఉధృతంగా కొనసాగించాలని అన్నారు,

 

అంతేకాదు బ్రిటిష్ వారు కల్పించిన హక్కులను సైతం కాలరాస్తున్న మోడీ సర్కార్ అడివి ఖనిజ సంపదను కార్పొరేటు సంస్థలతో కట్టబెట్టే కుట్రలో భాగంగా జీవో నెంబరు 49 నేటికీ డోలి మూతలు తప్పని గిరిజన గ్రామాలు తెలంగాణలో రాజీలేని పోరాటాలు చేస్తున్నప్పటికీ

 

ఆదివాసిలను అడవులకు దూరం చేసే కుట్ర జీవో నెంబరు 49 కేంద్ర ప్రభుత్వం నేషనల్ టైగర్ జోన్ టైగర్ పార్కు పేరుతో ఆదివాసీలను అడవికి దూరం చేస్తూ జీవో నెంబరు 49 ని తీసుకొచ్చారు,

 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న

రేవంత్ రెడ్డి సర్కారు సైతం ఆ జీవోని అమలు చేయాలని కుట్రలు పన్నుతున్నారని

ఈ జీవోతో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ కి

చెందిన 339 గ్రామాలను ఖాళీ చేయించి సుమారు 3.7 లక్షల వేల ఎకరాల భూమి కృరం భీమ్ ఫారెస్ట్ కనజ ర్వేషన్ రిజర్వ్ చేసి గిరిజనులకు దూరం చేయాలనే కుట్రలు పంపుతున్నారు అందులో సుమారు ఒక లక్ష యాభై వేలు ఎకరాలు పోడు భూములు

 

గుర్తించ బడ్డాయి 2025 మే 25న తీసుకువచ్చిన ఈ జీవో ని రద్దు చేయాలని ఆదివాసి సంఘాలు చేసిన పోరాటాలతో జీవోని తాతకాలికంగా నిలిపివేసిన, భవిష్యత్తులో మళ్లీ తీసుకురారన్న గ్యారంటీ లేదు, అందుకు ఆదివాసి గిరిజనలు పెద్ద ఎత్తున హక్కుల్ని కాపాడుకోవాలని అది

నీ సంపదని గిరిజనులకే దక్కాలని ఆగస్టు 9న ఆదివాసి గిరిజన అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram