నేపాల్ లో తీవ్ర ఆందోళనలు.. సరిహద్దును మూసేసిన భారత్

నేపాల్ లో ఆందోళనలు చెలరేగడంతో భారత్ అప్రమత్తమైంది. మతపరమైన ఘర్షణల నేపథ్యంలో భారత్-నేపాల్ సరిహద్దును తాత్కాలికంగా మూసివేసి, ఎమర్జెన్సీ సేవలు మినహా సీమాంతర కదలికలపై ఆంక్షలు విధించింది. ధనుశా జిల్లాలో ప్రార్థనా మందిర ధ్వంసానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పర్సా, రాహౌల్ తదితర ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. కొన్ని చోట్ల హింసకు దారితీయడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram