భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ రూ.44 వేలు

గోల్డెన్ న్యూస్ /వరంగల్ / తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది. WGL ఎనుమాములలో ఎల్లో మిర్చి ధర ఇవాళ క్వింటాల్ రూ. 44 వేలు పలికింది. దిగుబడి తగ్గడం, పచ్చళ్ల సీజన్ కావడంతో మిరపపొడికి వినియోగించే మిర్చి క్వింటాల్ మార్కెట్లో రూ.20వేలు దాటింది. గుంటూరు, మలక్పేట, ఖమ్మం మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దేవనూర్ డీలక్స్ మిర్చి ఏకంగా రూ.4వేలు పెరిగింది. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram