మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం అంతం : కేంద్ర మంత్రి అమిత్ షా

మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం అంతం: అమిత్ షా

 

దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, మావోయిస్టుల నిధులను అడ్డుకోవడం, లొంగుబాటు చర్యలు, భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు వారి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram