తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి.

.దీంతో, రానున్న రెండు.. మూడు రోజుల పిడుగులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దీంతో, పలు జిల్లాలకు ముందస్తు అలర్ట్స్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు, మూడు రోజులు ఏపీ.. తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాల లో సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కి.మీ మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో, ఈ రోజు, రేపు, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram