గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : అశ్వాపురం మండల పరిధిలోని గొల్లగూడెం ప్రధాన రహదారి పై శనివారం రోజున ఉదయం భద్రాచలం ఆర్టీవో పరుక్ ఆకస్మిక వాహనల తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా వాహన టాక్సీలను పరిశీలించి వాహనదారులు సమయానికి తమ వాహనాలకు టాక్సీలు చెల్లించాలని అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడపడం నేరమని తెలిపారు. వాహన దారులు సీటు బెల్టులు, హెల్మెట్లు, మీ వాహనాలతో పాటు లైసెన్సులు ఉంచుకోవాలని, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వాహనాలు నడపరాదని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని రోడ్డు భద్రతలు పాటించాలని సూచించారు.
Post Views: 145









