గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం : దుప్పి మాంసాన్ని ఫారెస్టు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో దుప్పి మాంసం అక్రమంగా విక్రయిస్తున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో. అటవీ అధికారులు అక్కడికి చేరుకుని అనుమానిత ఓ ఇంటిపై దాడి చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే సమాచారం ఇచ్చిన వ్యక్తిపై విక్రయదారులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 72








